Vijay Sai Reddy: ఇదిగో టీడీపీ నిజస్వరూపం: గంజాయిపై గంటా వ్యాఖ్యల వీడియో పంచుకున్న విజయసాయిరెడ్డి

  • ఏపీలో టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం
  • గంజాయి, డ్రగ్స్ పై మాటల తూటాలు
  • అప్పట్లో మంత్రిగా గంజాయిపై గంటా ప్రెస్ మీట్
  • విషయం ఇదీ అంటూ విజయసాయి ట్వీట్
Vijayasai Reddy shares Ganta comments video

ఏపీలో గత కొన్నిరోజులుగా రాజకీయాలు గంజాయి, డ్రగ్స్ కేంద్ర బిందువుగా సాగుతున్నాయి. ఈ అంశంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వీడియో పంచుకున్నారు. ఇదిగో టీడీపీ నిజస్వరూపం అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో నాటి మంత్రి గంటా ఓ మీడియా సమావేశంలో గంజాయి అంశంపై చేసిన వ్యాఖ్యలు ఇవిగో అంటూ ట్వీట్ చేశారు.

కాగా, ఆ వీడియోలో గంటా మాట్లాడుతూ, విశాఖ నుంచే దేశమంతా గంజాయి సరఫరా అవుతోందని వెల్లడించారు. ఆ క్రెడిట్ మన నగరానికే దక్కిందంటూ చంద్రబాబు కూడా చమత్కారంగా మాట్లాడారని గంటా నవ్వులు పూయించడం ఆ వీడియోలో చూడొచ్చు.

దీనిపై విజయసాయి స్పందిస్తూ, మరి లోకేశ్ నాయకత్వంలో అయ్యన్న, వెలగపూడి, నాటి విశాఖ రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ల గంజాయి వ్యాపార భాగస్వామ్యం గురించి గంట మోగించారో లేక బాబు పాత్రపై అనుమానమో కానీ.... విషయం మాత్రం ఇదీ అంటూ వివరించారు.

More Telugu News