Allu Arjun: 'పుష్ప' నుంచి వచ్చేస్తున్న మరో మాస్ సాంగ్!

  • ఫస్టు సింగిల్  గా వచ్చిన 'దాక్కో దాక్కో మేక'
  • సెకండ్ సింగిల్ గా ఆకట్టుకున్న 'శ్రీవల్లి'
  • ఈ నెల 28వ తేదీన రానున్న థర్డ్ సింగిల్
  • డిసెంబర్ 17వ తేదీన సినిమా విడుదల    
Pushpa 3rd single Promo

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాను, మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా వదలనున్నారు. ఒక భాగాన్ని డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఇంతవరకు రెండు లిరికల్ వీడియో సాంగులను వదిలారు. ఈ రెండింటికి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మూడో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

'నువ్వు అమ్మీ అమ్మీ అంటుంటే నీ పెళ్లానైపోయినట్టుందిరా సామీ .. నా సామీ' అంటూ ఈ పాట సాగుతోంది. ఇది పక్కా మాస్ బీట్ తో నడిచే పాట. పూర్తి లిరికల్ వీడియోను ఈ నెల 28వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు చెప్పారు. మాంఛి ఊపుతో సాగుతున్న ఈ పాటకి కూడా రాకెట్ లా దూసుకుపోయే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

More Telugu News