Pawan Kalyan: నేను, పవన్ కల్యాణ్ చాలా సేపు మాట్లాడుకున్నాం... ఆ విషయాన్ని మీడియా చూపించలేదు: మంచు విష్ణు

  • పవన్ కల్యాణ్, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్
  • స్టేజిపై ఉపరాష్ట్రపతి ఉన్నప్పుడు మాట్లాడలేము
  • పవన్ ఆశీస్సులు నాకు కావాలి
Me and Pawan Kalyan spoke for a long time says Manchu Vishnu

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిన్న నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, 'మా' అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మంచు మనోజ్ తదితరులు హాజరయ్యారు. 'మా' ఎన్నికల నేపథ్యంలో సినీ పరిశ్రమలో వివాదాలు తార స్థాయికి చేరిన సంగతి తెలిసిందే.

 ఈ నేపథ్యంలో నిన్న జరిగిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తో మంచు విష్ణు మాట్లాడే ప్రయత్నం చేసినా... పవన్ స్పందించలేదంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు, మంచు విష్ణు ఓ వీడియో పోస్ట్ చేసి ఇందులో ఉన్న వ్యక్తి (పవన్) ఎవరో గుర్తు పట్టగలరా? అంటూ ప్రశ్నించడం మరింత వివాదాస్పదమయింది. ఈ నేపథ్యంలో ఈరోజు మంచు విష్ణు మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.

పవన్ కల్యాణ్ గారు, తాము అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని విష్ణు చెప్పారు. స్టేజ్ పైకి వెళ్లక ముందు తామిద్దరం చాలా సేపు మాట్లాడుకున్నామని... ఆ విషయాన్ని మీడియా చూపించలేదని అన్నారు. 'మా' మన తల్లివంటిదని... జాగ్రత్తగా చూసుకో విష్ణూ అని పవన్ తనతో చెప్పారని వెల్లడించారు. స్టేజిపైన ఉపరాష్ట్రపతి ఉన్నారని... అక్కడ తాము మాట్లాడుకోవడానికి ప్రొటోకాల్ ఒప్పుకోదని అన్నారు. తనకు పవన్ కల్యాణ్, ఆయన అభిమానుల ఆశీస్సులు కావాలని చెప్పారు.

More Telugu News