Teenmaar Mallanna: రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడంటూ కల్లు వ్యాపారి ఫిర్యాదు.. తీన్మార్ మల్లన్నపై మరో కేసు

  • వరుస కేసులతో తీన్మార్ మల్లన్న ఉక్కిరిబిక్కిరి
  • కల్లు వ్యాపారి ఫిర్యాదుపై ఉప్పు  సంతోష్ అరెస్ట్
  • జైలులో ఉన్న మల్లన్నకు త్వరలో పీటీ వారెంట్ జారీ
Another Case against Teenmaar Mallanna in Nizamabad

వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై నిజామాబాద్ జిల్లాలో మరో కేసు నమోదైంది. తన నుంచి తీన్మార్ మల్లన్న రూ. 5 లక్షలు, ఉప్పు సంతోష్ రూ. 20 లక్షలు డిమాండ్ చేశారంటూ నిజామాబాద్‌కు చెందిన ఓ కల్లువ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్‌ను ఎ1గా, నవీన్‌ను ఎ2గా చేర్చారు. అనంతరం సంతోష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఓ కేసులో ఇప్పటికే జైలులో ఉన్న మల్లన్నకు ఈ కేసులో పీటీ వారెంట్ చేయనున్నట్టు పోలీసులు వర్గాలు తెలిపాయి.

More Telugu News