Venkatesh Daggubati: వెంకటేశ్ హీరోగా క్రిష్ మూవీ?

  • రేపు విడుదల కానున్న 'కొండ పొలం'
  • ఆ తరువాత పవన్ సినిమాపైనే దృష్టి
  • అడవి నేపథ్యంలోని మరో కథపై ఆసక్తి
  • నవల ఆధారంగా నిర్మితం కానున్న సినిమా  
Krish New Movie Update

క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'కొండ పొలం' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. వైష్ణవ్ తేజ్ - రకుల్ జంటగా నటించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి ఆల్బమ్ గా ఈ సినిమా పేరు కొట్టేసింది. ఈ సినిమా తరువాత క్రిష్ 'హరి హర వీరమల్లు' సినిమాను పూర్తిచేయనున్నాడు.

ఈ సినిమా తరువాత వెంకటేశ్ హీరోగా క్రిష్ ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఈ కథ కూడా అడవి నేపథ్యంలోనే సాగనుంది. డాక్టర్ కేశవరెడ్డి రాసిన 'అతడు అడవిని జయించాడు' ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ కథ కూడా అడవి .. దానికి సమీపంలోని గూడెంతో ముడిపడి సాగుతుంది.

గతంలో క్రిష్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 'కొండ పొలం' కథకి వస్తున్న రెస్పాన్స్ చూసిన తరువాత, క్రిష్  'అతడు అడవిని జయించాడు' కథపై దృష్టి పెట్టాడని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.

More Telugu News