Pawan Kalyan: మాంఛి జోరుమీదున్న 'భీమ్లా నాయక్'!

  • పవన్ సరసన నిత్యామీనన్
  • రానా జోడీగా సంయుక్త మీనన్
  • ఈ నెల 15వ తేదీన సెకండ్ సింగిల్
  • జనవరి 12వ తేదీన సినిమా విడుదల
Bheemla Nayak movie update

పవన్ కల్యాణ్ .. రానా ప్రధాన పాత్రధారులుగా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చాలా వేగంగా షూటింగు జరుపుకుంటోంది. ముందుగా ఈ సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశంతో, పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్టు పైనే పూర్తి దృష్టి పెట్టాడు. ఆయనకి సంబంధించిన మేజర్ పోర్షన్ ను చిత్రీకరించారు.

పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటించింది. ఆమె పోర్షన్ షూటింగును కూడా పూర్తి చేశారు. ఈ రోల్ చేయడానికి ఆమె పారితోషికంగా 80 లక్షలకి పైగా తీనుకున్నట్టు చెబుతున్నారు. ఇక రానా జోడీ ఎంపిక విషయంలోనే కాస్త ఆలస్యం జరిగింది. ఆయన సరసన సంయుక్త మీనన్ ను తీసుకున్నారు. ఆ విషయాన్ని ఆమె కూడా ధ్రువీకరించింది.

ఈ ఇద్దరి కాంబినేషన్ సీన్లు ఎక్కువగా చిత్రీకరించవలసి ఉందట. ఈ నెలాఖరుతో షూటింగు పార్టును పూర్తి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు సింగిల్ రికార్డు స్థాయిలో వ్యూస్ ను .. లైక్స్ ను రాబట్టుకుంది. ఈ నెల 15వ తేదీన సెకండ్ సింగిల్ ను వదలనున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

More Telugu News