Venkatesh Daggubati: ఇన్‌స్టాలో హీరో వెంక‌టేశ్ చేసిన పోస్ట్ వైర‌ల్!

  • 'మనసు ఆలోచనలతో నిండి వుంటుంది' అని వ్యాఖ్య‌
  • మనం వెళ్లే మార్గాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల‌ని హితవు   
  • మాట్లాడేముందు మొదట కాస్త మెద‌డుతో ఆలోచించాల‌ని పోస్ట్
  • నాగ చైత‌న్య‌, స‌మంత గురించే అంటూ నెటిజ‌న్లు కామెంట్లు
venkatesh post goes viral

టాలీవుడ్ జంట నాగ చైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డంతో వారి బంధువులు, మిత్రులు ఏ పోస్టు చేసినా అది వారి గురించేన‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.  నాగ చైతన్య మేనమామ విక్టరీ వెంకటేశ్ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేశారు. అది నాగ చైత‌న్య‌, స‌మంత గురించే అయి ఉండొచ్చ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

మనసు ఆలోచనలతో నిండి వుంటుందనీ, మనం వెళ్లే మార్గాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల‌ని ఆయ‌న ఓ కొటేషన్ ను పేర్కొన్నారు. అంత‌కు ముందు కూడా మనం ఏదైనా విషయంపై మాట్లాడేముందు మొదట కాస్త మెద‌డుతో ఆలోచించాల‌ని అన్నారు. సాధార‌ణంగా వెంక‌టేశ్ రెగ్యుల‌ర్‌గా ఇటువంటి కొటేషన్లు పెడుతుంటారు. అయితే, చై-సామ్ విడిపోయిన వేళ ఆయ‌న చేసిన‌ పోస్టులు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.
        

More Telugu News