Rana Daggubati: మరో మల్టీస్టారర్ మూవీలో రానా?

  • ఒక వైపున రీమేకుల జోరు
  • మరో వైపున మల్టీ స్టారర్ ప్రాజెక్టులు
  • మైత్రీ బ్యానర్లో రానా - శర్వానంద్
  • కొత్త దర్శకుడి పరిచయం  
Rana and Sharwanand multi starerr movie update

తెలుగు తెరపై ఒక వైపున రీమేక్ లు .. మరో వైపున మల్టీ స్టారర్ సినిమాలు రాజ్యమేలుతున్నాయి. చరణ్ - ఎన్టీఆర్ కలిసి 'ఆర్ ఆర్ ఆర్' చేశారు. శర్వానంద్ - సిద్ధార్థ్ కాంబినేషన్లో 'మహాసముద్రం' రూపొందింది. ఇక పవన్ - రానా కథానాయకులుగా 'భీమ్లా నాయక్' నిర్మితమవుతోంది. అలాగే వెంకటేశ్ - వరుణ్ తేజ్ కలిసి 'ఎఫ్ 3' సినిమాను చేస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి మరో ఇద్దరు హీరోలు చేరిపోయారు. ఒకరు రానా అయితే మరొకరు శర్వానంద్. ఈ ఇద్దరి కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతవరకూ స్టార్ డైరెక్టర్ల దగ్గర పనిచేస్తూ, మైత్రీ కళ్లలో పడిన ఒక యువకుడు, ఈ సినిమాను రూపొందించనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు చెబుతున్నారు. 

More Telugu News