Telangana: నిజామాబాద్‌లో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం

  • యువతికి మద్యం తాగించి ఆపై అత్యాచారం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
  • పరారీలో నిందితులు
Ganga Rape in Nizamabad Telangana

తెలంగాణలోని నిజామాబాద్‌లో దారుణం జరిగింది. ఓ యువతికి మద్యం తాగించిన నలుగురు యువకులు ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా, బాధితురాలు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.

More Telugu News