Chiranjeevi: పాటల పనిలో బిజీగా 'ఆచార్య'

  • 'ఆచార్య' టాకీ పార్టు పూర్తి
  • పెండింగులో ఉన్న రెండు పాటలు
  • ఈ నెలాఖరుతో షూటింగు పార్టు పూర్తి
  • దీపావళికి విడుదల చేసే ఛాన్స్
Acharya shooting update

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఇటీవలే టాకీ పార్టును పూర్తిచేసుకుంది. కేవలం రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నాయని చెప్పారు. ఆ రెండు పాటలను చిత్రీకరించడానికి ఇప్పుడు రంగంలోకి దిగారు.

చిరంజీవి - చరణ్ కాంబినేషన్లోని ఒక పాటను ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల పాటు ఈ పాటను షూట్ చేస్తారట. ఆ తరువాత ఈ నెల చివరివారంలో చరణ్ - పూజ హెగ్డే కాంబినేషన్లో ఒక డ్యూయెట్ ను చిత్రీకరిస్తారని అంటున్నారు. మణిశర్మ స్వరపరిచిన ఈ రెండు పాటలు ఇటు యూత్ ను .. అటు మాస్ ను ఒక ఊపు ఊపేస్తాయని చెబుతున్నారు. ఆల్రెడీ 'లాహే లాహే' సాంగ్ జనంలోకి దూసుకుపోయింది. ఇక రెజీనా ఐటమ్ సాంగ్ ఉండనే ఉంది. దీపావళికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

More Telugu News