Telangana: తెలంగాణ రోజువారీ కొవిడ్ కేసుల వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 75,199 కరోనా పరీక్షలు
  • 315 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 83 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 5,470 మందికి చికిత్స
Telangana corona bulletin by health ministry

తెలంగాణలో రోజువారీ కరోనా కేసుల తాజా బులెటిన్ ను రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 75,199 కరోనా పరీక్షలు చేయగా, 315 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 83 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 21, వరంగల్ అర్బన్ జిల్లాలో 21, కరీంనగర్ జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 340 మంది కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,60,786 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,51,425 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,470 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,891కి పెరిగింది.

More Telugu News