Adi Saikumar: 'అతిథి దేవోభవ' ఫస్టులుక్ రిలీజ్!

  • ఆది సాయికుమార్ నుంచి 'అతిథి దేవోభవ'
  • యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
  • దర్శకుడిగా పొలిమేర నాగేశ్వర్ 
  • కథానాయికగా 'నువేక్ష' పరిచయం
Athidhi Devobhava first look released

ఆది సాయికుమార్ కొత్త కథలకు ప్రాధాన్యతనిస్తూ వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. కిరాతక .. అమరన్ .. బ్లాక్ సినిమాలను పట్టాలెక్కించిన ఆయన, ఆ జాబితాలోకి 'అతిథి దేవోభవ' సినిమాను కూడా చేర్చాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

ఒక మిర్రర్ లో ఒక యువ జంట చాలా చేరువగా కనిపిస్తూ ఉండటంతో, ఆ మిర్రర్ లోకి ఆత్రుతగా వెళ్లడానికి హీరో ట్రై చేస్తున్నట్టుగా ఈ ఫస్టులుక్ పోస్టర్ ఉంది. కథ ఏమిటి? పాత్రల స్వరూప స్వభావాలేమిటి? అనే విషయాలు పక్కన పెడితే, ఈ పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించిన ఈ సినిమా ద్వారా, పొలిమేర నాగేశ్వర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా ద్వారా, 'నువేక్ష' కథానాయికగా పరిచయమవుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు తెలియనున్నాయి. 

More Telugu News