Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసుల దుర్మరణం

  • శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో ఘోర ప్రమాదం
  • ఏఆర్ పోలీసులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనానికి యాక్సిడెంట్
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుళ్లు
Four police dead in road accident in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగింది. బొలెరో వాహనంలో ఏఆర్ కానిస్టేబుళ్లు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా... పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

More Telugu News