Andhra Pradesh: ఏపీ స్కూళ్లలో కరోనా కలకలం

  • కృష్ణా జిల్లాలో ఒకే స్కూల్లో 10 మంది విద్యార్థులకు కరోనా
  • ప్రకాశం జిల్లా స్కూల్లో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులకు కరోనా
  • ఏపీలో ఇటీవలే ప్రారంభమైన పాఠశాలలు
AP students are tested with corona

ఏపీలో పాఠశాలలు మళ్లీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు పాఠశాలల్లో కూడా కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో డీఆర్ఎం మున్సిపల్ స్కూలులో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు చిన్నారులు కరోనా బారిన పడ్డారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎంపీసీ కండ్రిగలోని స్కూలులో ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకింది. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు హైస్కూల్లో 10 మందికి కరోనా సోకింది. దీంతో ఈ పాఠశాలకు విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. పాఠశాలల్లో కరోనా కేసులు వస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

More Telugu News