Mohanlal: మిస్టరీ థ్రిల్లర్ గా '12th Man' .. మొదలైన షూటింగ్!

  • 'దృశ్యం' దర్శకుడితో మోహన్ లాల్ 
  • మిస్టరీ థ్రిల్లర్ గా 12th Man
  • స్క్రీన్ ప్లే ప్రధానంగా నడిచే కథ 
  • తక్కువ బడ్జెట్ లో చేసే దర్శకుడు జీతూ   
12th Man movie shooting started

మోహన్ లాల్ కథానాయకుడిగా '12th Man' రూపొందనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తొలి షెడ్యూల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ప్లాన్ చేశారు. జీతూ జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అడుగడుగునా ఉత్కంఠను రేకెత్తించే మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది.

జీతూ జోసెఫ్ మంచి రచయిత .. దర్శకుడు అని చెప్పడానికి 'దృశ్యం' సినిమా ఒక్కటి ఉదాహరణగా తీసుకుంటే సరిపోతుంది. ఆయన కథలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటూనే ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాగే ఆయన ఎంచుకునే పాయింట్ అన్ని ప్రాంతాలవారికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. 'దృశ్యం' సినిమా వివిధ భాషల్లో రీమేక్ కావడమే అందుకు నిలువెత్తు నిదర్శనం.

ఇక చాలా తక్కువ బడ్జెట్ లో .. తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేయడం జీతూ జోసెఫ్ ప్రత్యేకత. ఆయన నుంచి 'దృశ్యం' .. 'దృశ్యం 2' సినిమాలతో హిట్ అందుకున్న మోహన్ లాల్ మరో ఛాన్స్ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోనే '12th Man' రూపొందుతోంది. పోస్టర్ తోనే ఉత్కంఠను పెంచుతున్న ఈ సినిమా, మరో సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.

More Telugu News