Andhra Pradesh: జీవోలు ఆన్ లైన్ లో పెట్టకూడదంటూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

  • 2008 నుంచి జీవోలను వెబ్ సైట్లలో పెడుతున్న వైనం
  • ఈ విధానానికి స్వస్తి పలికిన వైసీపీ ప్రభుత్వం
  • ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం పబ్లిక్ డొమైన్లో జీవోలు పెట్టకూడదని నిర్ణయం
AP Govt decides to not to put GOs in public domain

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వులను (జీవోలను) ఇకపై ఆన్ లైన్ లో పెట్టకూడదని నిర్ణయించింది. ఈ మేరకు పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ వెబ్ సైట్లో జీవోలను ఉంచే ప్రక్రియ 2008 నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా ఈ ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే వచ్చింది.

తాజాగా ఈ విధానానికి స్వస్తి పలుకుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదని నిర్ణయించింది. జీవోలను వెబ్ సైట్లలో ఉంచొద్దని అన్ని శాఖల కార్యదర్శులకు మెమో పంపింది.

More Telugu News