Telangana: తెలంగాణలో కొత్తగా 623 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 1,12,796 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 77 కేసులు
  • నారాయణపేట జిల్లాలో కొత్త కేసులు నిల్
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 8,803 మందికి చికిత్స
Telangana corona positive cases bulletin

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,12,796 కరోనా పరీక్షలు నిర్వహించగా, 623 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 77, కరీంనగర్ జిల్లాలో 65, వరంగల్ అర్బన్ జిల్లాలో 59, ఖమ్మం జిల్లాలో 52 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 594 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,47,229 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,34,612 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,803 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,814కి చేరింది.

More Telugu News