Siddaramaiah: మోదీకి దమ్ముంటే యడియూరప్పపై విచారణ జరిపించాలి: సిద్ధరామయ్య

  • యడియూరప్ప అవినీతికి పాల్పడిన వ్యక్తి
  • తినను, తిననివ్వను అని మోదీ ప్రమాణం చేశారు
  • ప్రమాణాన్ని నిలబెట్టుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది
Modi has to probe in Yediyurappa corruption demands Siddaramaiah

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. యడియూరప్ప అంతులేని అవినీతికి పాల్పడిన వ్యక్తి అని ఆరోపించారు. 'న ఖావూంగా, న ఖానేదూంగా' (తినను, తిననివ్వను) అని మోదీ చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకునేందుకు ఇప్పుడు అవకాశం వచ్చిందని అన్నారు. మోదీకి దమ్ముంటే యడియూరప్ప అవినీతిపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ఈ మేరకు వరుస ట్వీట్లతో మోదీ, బీజేపీ, యడియూరప్పలపై ఆయన మండిపడ్డారు.

More Telugu News