Andhra Pradesh: ఏపీలో కొత్తగా 2,567 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 81,763 కరోనా పరీక్షలు
  • తూర్పుగోదావరి జిల్లాలో 356 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 18 కేసులు
  • రాష్ట్రంలో 18 మంది మృతి
AP Corona details

ఏపీలో గడచిన 24 గంటల్లో 81,763 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,567 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 356 కొత్త కేసులు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో 351 కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 300, పశ్చిమ గోదావరి జిల్లాలో 279 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 3,034 మంది కోలుకోగా, 18 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,26,988 పాజిటివ్ కేసులు నమోదు కాగా...  18,87,236 మంది కరోనా బారి నుంచి విముక్తులయ్యారు. ఇంకా 26,710 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 13,042కి పెరిగింది.

More Telugu News