Sourav Ganguly: రూ.35 కోట్ల చెల్లింపుపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన సౌరవ్ గంగూలీ

  • గతంలో గంగూలీకి, రెండు సంస్థలతో ఒప్పందం
  • గంగూలీకి మేనేజర్లుగా ఆయా సంస్థలు
  • ఒప్పందం విచ్ఛిన్నం
  • ఆర్బిట్రేషన్ కు ఫిర్యాదు చేసిన గంగూలీ
  • గంగూలీకి అనుకూలంగా తీర్పు
Sourav Ganguly files petition in Baombay High Court

గతంలో తన క్రీడా వ్యవహారాలను పర్యవేక్షించిన రెండు సంస్థల నుంచి తనకు రావాల్సిన రూ.35 కోట్లు చెల్లించేలా ఆదేశాలివ్వాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు సంస్థలు తనకు రూ.35 కోట్లు పరిహారంగా చెల్లించాలని గతంలో ఆర్బిట్రేషనల్ ట్రైబ్యునలర్ ఆదేశాలు ఇచ్చిందని, ఆ ఆదేశాలు అమలయ్యేలా ఆ రెండు సంస్థలపై చర్యలు తీసుకోవాలని గంగూలీ కోరారు.

ఇంతకీ ఈ కేసు ఈ ఏంటంటే... గంగూలీ గతంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో గంగూలీ కికెట్ మేనేజ్ మెంట్ వ్యవహారాలను పర్సెప్ట్ టాలెంట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్, పర్సెప్ట్ డి మార్క్ (ఇండియా) లిమిటెడ్ అనే రెండు సంస్థలు పర్యవేక్షించాయి. ఈ రెండు సంస్థలు గంగూలీకి మేనేజర్లుగా వ్యవహరించాయి. ఈ మేరకు గంగూలీకి, ఆ సంస్థలకు మధ్య ఒప్పందం కుదిరింది.

అయితే, ఈ ఒప్పందం విచ్ఛిన్నం కావడంతో గంగూలీ... ఆ ఒప్పందంలోని ఓ నిబంధన ఆధారంగా ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ గంగూలీకి రూ.14,49,91,000 చెల్లించాలని, దాంతో పాటు ఆ మొత్తానికి ఏడాదికి 12 శాతం చొప్పున వడ్డీ కూడా కలిపి ఇవ్వాలని పర్సెప్ట్ టాలెంట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్, పర్సెప్ట్ డి మార్క్ (ఇండియా) లిమిటెడ్ సంస్థలను ఆదేశించింది.

ఈ ఆదేశాల అమలుకు గంగూలీ కోల్ కతా హైకోర్టును ఆశ్రయించగా, ఈ వ్యవహారం తమ పరిధిలోకి రాదని కోల్ కతా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గంగూలీ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

More Telugu News