Unity-22: అంతరిక్షానికి పయనమైన వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక

  • రోదసి యాత్ర చేపట్టిన వర్జిన్ గెలాక్టిక్
  • ఆలస్యంగా అంతరిక్ష యాత్ర
  • ప్రతికూల వాతావరణమే కారణం
  • కొద్దిసేపటి క్రితమే తొలి ఘట్టం పూర్తి
Virgin Galactic space craft has taken off

అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష యాత్రలో తొలి ఘట్టం పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే వర్జిన్ గెలాక్టిక్ అధినేత సర్ రిచర్డ్ బ్రాన్సన్, ఐదుగురు వ్యోమగాములతో వీఎస్ఎస్ యూనిటీ-22 వ్యోమనౌకతో కూడిన వీఎంఎస్ ఈవ్ స్పేస్ క్రాఫ్ట్ నింగికెగిసింది.

వాస్తవానికి ఈ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 6.30 గంటలకు నింగిలోకి వెళ్లాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో గంటన్నర పాటు వాయిదా వేశారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే న్యూ మెక్సికో నుంచి వీఎస్ఎస్ యూనిటీ-22 సహిత వీఎంఎస్ ఈవ్ రోదసి దిశగా దూసుకెళ్లింది.

ఈ నౌకలో తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా ఉన్నారు. కాగా, ఆరుగురు వ్యోమగాములు 90 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉండి, ఆపై భూమికి తిరిగిరానున్నారు.

More Telugu News