Chiranjeevi: రంగంలోకి దిగిపోయిన 'ఆచార్య'

  • కరోనా కారణంగా ఆగిన షూటింగు
  • ఈ రోజునే మళ్లీ సెట్స్ పైకి వెళ్లిన టీమ్
  • కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ
  • ఈ నెలాఖరుకి షూటింగు పార్టు పూర్తి  
Acharya shooting Re started

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' రూపొందుతోంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి చాలాకాలం అయింది. అయితే మధ్య మధ్యలో కరోనా కారణంగా అవరోధాలు ఎదురయ్యాయి. ఇటీవల కూడా కరోనా వల్లనే షూటింగు ఆగిపోయింది. ఇక ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గడం వలన ఈ రోజున షూటింగును మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి .. చరణ్ ఇద్దరూ కూడా పాల్గొంటున్నట్టు చెబుతున్నారు. కొన్ని కీలమైన సన్నివేశాలను ప్లాన్ చేశారట. 

ఈ షెడ్యూలుతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. ఈ నెల చివరికి ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ఆగస్టులో నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతాయి. సెప్టెంబర్లో ప్రమోషన్లు మొదలుపెట్టి, దసరాకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. సీనియర్ హీరోయిన్స్ లో కాజల్ కి .. యంగ్ హీరోయిన్స్ లో పూజ హెగ్డేకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. దాదాపు ఈ సినిమా దసరాకి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.

More Telugu News