AP BJP: వివిధ విభాగాలకు రాష్ట్ర కమిటీలు ప్రకటించిన ఏపీ బీజేపీ

  • క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి చర్యలు
  • రాష్ట్ర కమిటీలకు హైకమాండ్ ఆమోదం
  • ట్విట్టర్ లో స్పందించిన సోము వీర్రాజు
  • కొత్త కమిటీల జాబితాలు విడుదల
AP BJP announces state committees

ఏపీ బీజేపీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది. వివిధ విభాగాలకు సంబంధించి రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు బీజేపీ హైకమాండ్ ఆమోదం తెలిపింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఓ ప్రకటనలో కమిటీల వివరాలు వెల్లడించారు. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన ఆయన, ఆయా కమిటీలు, సభ్యుల జాబితాలను పంచుకున్నారు. ఈ కమిటీల్లో అవకాశం లభించిన కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కమిటీ సభ్యులందరూ వారి బాధ్యతలకు తగిన న్యాయం చేస్తారని, పార్టీ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News