Chiranjeevi: చివరి షెడ్యూల్ షూట్ కి వెళుతున్న 'ఆచార్య'

  • ఈ నెల 7వ తేదీన సెట్స్ పైకి 'ఆచార్య'
  • కీలకమైన పాత్రలో సోనూ సూద్
  • ప్రత్యేక పాత్రలో సంగీత
  • దసరాకి భారీస్థాయి విడుదల    
Acharya movie last schedule update

చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. 14 రోజుల పాటు చిత్రీకరణ జరిపితే షూటింగు పార్టు పూర్తవుతుంది. అందువలన ఈ నెల 7వ తేదీన మళ్లీ సెట్స్ పైకి వెళుతున్నారు. ఏకధాటిగా 14 రోజుల పాటు షూటింగును జరపనున్నారు. చిరంజీవి .. చరణ్ తదితరులు ఈ షెడ్యూల్లో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో చిరంజీవి .. చరణ్ ఇద్దరూ కూడా దోపిడీదారులకు గుణపాఠం చెప్పే పాత్రల్లో కనిపించనున్నారు. చిరంజీవి సరసన నాయికగా కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలవనుందని అంటున్నారు. సోనూ సూద్ .. జిషు సేన్ గుప్తా కీలకమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాలో, సంగీత ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. దసరా కానుకగా అక్టోబర్ 13 .. 14 తేదీలలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

More Telugu News