Telangana: తెలంగాణలో కొత్తగా 1,933 కరోనా పాజిటివ్ కేసుల వెల్లడి

  • గత 24 గంటల్లో 1,32,996 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 165 కొత్త కేసులు
  • రాష్ట్రంలో 16 మంది మృతి
  • ఇంకా 25,406 మందికి చికిత్స
Telangana positive cases update

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,32,996 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,933 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 165 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 160 కేసులు గుర్తించారు. నల్గొండ జిల్లాలో 148 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 6 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 3,527 మంది కోలుకోగా, 16 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,394కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 5,93,103 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,64,303 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 25,406 మందికి చికిత్స కొనసాగుతోంది. రాష్ట్రంలో రికవరీ రేటు 95.14 శాతానికి పెరిగింది.

More Telugu News