Jagan: ఏపీలో వైఎస్సార్ ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు... అధికారులతో చర్చించిన సీఎం జగన్

  • తాడేపల్లి క్యాంపు కార్యాలయలో సీఎం సమీక్ష
  • అత్యుత్తమ ప్రమాణాలతో విద్యపై చర్చ
  • నిరుపేద చిన్నారులకు నాణ్యమైన విద్య
  • పిల్లలకు కిలోమీటరు దూరంలోనే ప్రీప్రైమరీ స్కూళ్లు
CM Jagan discuss on pre primary and foundation schools in AP

ఏపీలో వైఎస్సార్ ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. ఇవాళ ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలన్నదే తన తపన అని స్పష్టం చేశారు. ఆ విధమైన ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చినవే వైఎస్సార్ ప్రీప్రైమరీ పాఠశాలలు, ఫౌండేషన్ పాఠశాలలు అని వివరించారు. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చేస్తున్నామని, ఇప్పుడు వైఎస్సార్ ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లతో విద్యాప్రమాణాలను మరింత ఉన్నతీకరిస్తామని అన్నారు.

చిన్నారుల్లో 6 ఏళ్ల లోపే 80 శాతం మేధో వికాసం కలుగుతుందని, ఆ వయసులోని నిరుపేద చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు ఉపయోగపడతాయని తెలిపారు. వైఎస్సార్ ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు అన్నీ పిల్లలకు కిలోమీటరు దూరంలోనే ఉండాలని, అన్ని హైస్కూళ్లు 3 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలని, ఆ విధంగా స్కూళ్ల మ్యాపింగ్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

More Telugu News