Andhra Pradesh: ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా ఉద్ధృతి... ఒక్కరోజులో 114 మంది మృతి

  • పశ్చిమ గోదావరిలో 17 మంది మృతి
  • చిత్తూరు జిల్లాలో 15 మంది కన్నుమూత
  • 9,800కి చేరిన కరోనా మృతుల సంఖ్య
  • ఇతర జిల్లాల్లోనూ పెరుగుతున్న కరోనా మరణాలు
Corona deaths raises in AP during second wave

ఏపీలో కరోనా బీభత్సానికి అడ్డుకట్ట పడడంలేదు. ఒక్కరోజు వ్యవధిలో కరోనా ప్రభావానికి 114 మంది మృత్యువాత పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 17 మంది, చిత్తూరు జిల్లాలో 15 మంది మరణించారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 9,800కి చేరింది.

గడచిన 24 గంటల్లో అన్ని జిల్లాల్లో కలిపి 1,01,281 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,610 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 3,602 కేసులు, చిత్తూరు జిల్లాలో 3,185 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 23,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 15,21,142 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 13,02,208 మంది పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,09,134 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News