Chiranjeevi: 'ఆచార్య'కి ఆ సాంగ్ హైలైట్ గా నిలుస్తుందట!

  • ముగింపు దశలో 'ఆచార్య'
  • చిరూ సరసన నాయికగా కాజల్
  • చరణ్ జోడీగా పూజా హెగ్డే
  • త్వరలో షూటింగు పార్టు పూర్తి  
Charan and Pooja Hegde song is highlight in Acharya

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటిస్తుండగా, చరణ్ - పూజ హెగ్డే ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. గతంలో చిరూ - మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. దాంతో ఈ సినిమా సాంగ్స్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడం ఖాయమనే సూచనగా, ఇటీవల వదిలిన చిరంజీవి సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమాలో చరణ్ పై రెండు పాటలు ఉండనున్నాయని అంటున్నారు. ఒక పాట చరణ్ తన అనుచరులతో కలిసి ఉద్యమ స్ఫూర్తిని రేకెత్తించేది కాగా, మరొకటి హీరో హీరోయిన్ల మధ్య సాగే డ్యూయెట్. ఈ ఇద్దరిపై వచ్చే సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సంగీత సాహిత్యాల పరంగా .. చిత్రీకరణ పరంగా ఈ సాంగ్ కి ఎక్కువ మార్కులు పడిపోతాయని చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగు కొంతమాత్రమే మిగిలి ఉంది. త్వరలోనే ఆ కాస్తా షూటింగు కానిచ్చేసి, షూటింగు పార్టును పూర్తిచేయనున్నారు.

More Telugu News