Kollu Ravindra: కేసీఆర్ ను చూసైనా జగన్ తాడేపల్లి రాజప్రాసాదం వదిలి బయటికి రావాలి: కొల్లు రవీంద్ర

  • గాంధీ ఆసుపత్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్
  • కరోనా రోగులకు చికిత్స, సౌకర్యాలపై పరిశీలన
  • జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కున్నాడన్న కొల్లు
  • కేసీఆర్ ను చూసి జగన్ సిగ్గు తెచ్చుకోవాలని వ్యాఖ్యలు
Kollu Ravindra demands Jagan should come out of Tadepalli residence after KCR visit at Gandhi hospital

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ గాంధీ ఆసుపత్రిలో పర్యటించి కరోనా రోగుల బాగోగులను, వారికి అందుతున్న చికిత్స, ఆసుపత్రిలో సౌకర్యాలు తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో, ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసైనా జగన్ సిగ్గు తెచ్చుకోవాలని విమర్శించారు.

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ తాడేపల్లి రాజప్రాసాదం వదిలి బయటికి రావాలని, వాస్తవ పరిస్థితులు తెలుసుకుని ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు.

More Telugu News