Mahesh Babu: 'సర్కారువారి పాట' దసరా తరువాత విడుదల?

  • పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట'
  • వినోదమే ప్రధానంగా సాగే కథ
  • మహేశ్ నెక్స్ట్ ప్రాజెక్టు త్రివిక్రమ్ తో    
Sarkaru Vari Pata Preponed to Dasara

మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ - 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగు జరుగుతోంది. పూర్తి వినోదభరితంగా రూపొందుతున్న ఈ సినిమాలో, కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని భావించారు. ఆ దిశగానే షూటింగు జరుగుతోంది. కానీ ఇప్పుడు ఈ సినిమాను దసరా తరువాత విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.


'సర్కారు వారి పాట' తరువాత మహేశ్ బాబు మరే సినిమాను ఒప్పుకోలేదు. అందువలన ఈ సినిమానే నిదానంగా .. నింపాదిగా చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అనుకోకుండా త్రివిక్రమ్ తో ప్రాజెక్టు సెట్ అయింది. అందువలన సాధ్యమైనంత త్వరగా ఆయన 'సర్కారువారి పాట'ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఈ ఏడాది దసరా తరువాత ఈ సినిమాను విడుదల చేసి, వచ్చే ఏడాది వేసవిలో త్రివిక్రమ్ సినిమా రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

More Telugu News