Vizag: విశాఖ జిల్లాలో ఆరుగురిని ఒకేసారి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తి!

  • పెందుర్తి మండలంలో కలకలం
  • పదునైన ఆయుధంతో దాడి
  • ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు
6 Murders in Vizag District

విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన పెందుర్తి మండలం జుత్తాడలో ఈ తెల్లవారుజామున చోటు చేసుకుంది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇంట్లో నిద్రపోతున్న వారిపై ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేసి, ఒక్కొక్కరినీ హతమార్చినట్టుగా తెలుస్తోంది. ఇంట్లో మృతదేహాలు రక్తపు మడుగులో పడివుండి భీతావహంగా కనిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

More Telugu News