Vijayawada: భార్య అనారోగ్యాన్ని చూడ‌లేక కూతురితో క‌లిసి ఉరి వేసుకున్న భర్త‌.. త‌మ‌ అవ‌య‌వాలు భార్య‌కు ఇవ్వాల‌ని లేఖ‌

  • విజ‌య‌వాడ‌లోని శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలో విషాద ఘ‌ట‌న
  • కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతోన్న‌ భార్య భ‌ర‌ణి
  • భ‌ర్త ర‌వి రాసిన ఆత్మ‌హ‌త్య లేఖను గుర్తించిన పోలీసులు
man commits suicide in vijayawada

విజ‌య‌వాడ‌లోని శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. గ‌తంలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేసిన ఓ వ్య‌క్తి త‌న ప‌దేళ్ల‌ కూతురితో క‌లిసి ఈ రోజు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఆత్మ‌హ‌త్య లేఖ‌ను గుర్తించారు.

కిడ్నీ వ్యాధితో భార్య బాధ‌ప‌డుతూ ఉండ‌డం చూడ‌లేక తాను చ‌నిపోతున్నాన‌ని భ‌ర్త జ‌గాని ర‌వి (40) అందులో పేర్కొన్నాడు. త‌న అవ‌య‌వాలతో పాటు కూతురి అవ‌య‌వాల‌ను త‌న భార్య భ‌ర‌ణికి ఇవ్వాల‌ని ఆత్మ‌హ‌త్య లేఖ రాశాడు.

గ‌తంలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేసిన ర‌వి అనంత‌రం ఆ ఉద్యోగాన్ని మానేసిన‌ట్లు
పోలీసులు గుర్తించారు. ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులూ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

More Telugu News