Andhra Pradesh: ఏపీలో ఈ నెల 7, 8 తేదీల్లో సెలవులు... ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

  • ఏపీలో ఈ నెల 8న పరిషత్ ఎన్నికలు
  • 7వ తేదీన ఎన్నికల ఏర్పాట్ల నిమిత్తం సెలవు
  • ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లకు రెండ్రోజులు సెలవులు
  • 48 గంటల ముందుగా మద్యం దుకాణాలు బంద్
AP Govt announces two days holidays for Parishat elections

ఏపీలో ఈ నెల 8న పరిషత్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజులు సెలవులు ప్రకటించింది. ఈ నెల 8వ తేదీతో పాటు, 7వ తేదీన కూడా సెలవుగా పేర్కొంది. 7వ తేదీన ఎన్నికల ఏర్పాట్ల నిమిత్తం సెలవు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, సంస్థలకు, దుకాణాలకు, వాణిజ్య సంస్థలకు సెలవు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాగా, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రెండ్రోజులు ముందుగానే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

More Telugu News