Corona Virus: తెలంగాణ‌లో కొన‌సాగుతోన్న క‌రోనా విజృంభ‌ణ‌

  • 24 గంటల్లో కొత్త‌గా 1,097 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  3,13,237
  • మృతుల సంఖ్య 1,723
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 302 మందికి క‌రోనా  
  Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 1,097 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 268 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,237కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,02,768 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,723గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 8,746 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 4,458 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 302 మందికి క‌రోనా సోకింది.

     
  

More Telugu News