BJP: మాస్కులు పెట్టుకునే అవ‌స‌రం లేదు.. పెట్టుకుంటే బ్యూటీ పార్లర్‌కు ఎలా వెళ్లగలం?: బీజేపీ నేత హిమంత్

  • ప్ర‌జ‌లు మాస్కులు పెట్టుకుని భయాలను పెంచుతున్నారు
  • మాస్కులు ఎప్పుడు పెట్టుకోవాలో మేము తెలియజేస్తాం
  • ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రించాల్సి ఉంది
  • కరోనా సోకింద‌ని అనుమానం వ‌స్తేనే మాస్కు పెట్టుకోవాలి
dont wear masks bjp leader requests people

క‌రోనా మ‌రోసారి విజృంభిస్తోన్న నేప‌థ్యంలో మాస్కులు ధ‌రించాల‌ని వైద్యులు సూచిస్తోన్న విష‌యం తెలిసిందే. ప‌లు ప్రాంతాల్లో మాస్కులు ధ‌రించ‌క‌పోతే ఫైన్లు కూడా వేస్తున్నారు. క‌రోనా నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని అన్ని రాష్ట్రాల్లో ప్ర‌చారాలు చేస్తున్నారు. అయితే, అసోం ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నేత హిమంత్ బిశ్వా మాత్రం మాస్కులు పెట్టుకునే అవ‌స‌రం లేదంటూ వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌జ‌లు  మాస్కులు పెట్టుకుని భయాలను పెంచుతున్నారని ఆయ‌న ఓ ఇంటర్వ్యూలో అన్నారు. త‌మ రాష్ట్రంలో ఇప్పుడు మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని,  రాష్ట్రంలో ప్రజలు మాస్క్ లు ఎప్పుడు పెట్టుకోవాలో తాము తెలియజేస్తామని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాము ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రించాల్సి ఉంద‌ని తెలిపారు. మాస్కులు పెట్టుకుంటే బ్యూటీ పార్లర్‌కు ఎలా వెళ్లగలమని ఆయ‌న ప్రశ్నించడం గ‌మ‌నార్హం. ఒక‌వేళ‌ ఎవరికైనా కరోనా సోకింద‌ని అనుమానం వ‌స్తే అప్పుడే వారు మాస్కు పెట్టుకోవాలని ఆయ‌న సూచించారు.  


More Telugu News