Nara Lokesh: దాడిలో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థికసాయం అందించిన నారా లోకేశ్

  • సత్తెనపల్లి నియోజకవర్గంలో కృష్ణారావు అనే కార్యకర్త మృతి
  • వైసీపీ గూండాలే చంపారంటూ టీడీపీ ఆరోపణ
  • కృష్ణారావుకు లోకేశ్ నివాళి
  • కుటుంబ సభ్యులకు పరామర్శ
  • సైకోరెడ్డికి వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్
Nara Lokesh handed over cash cheque to a party worker family

సత్తెనపల్లి నియోజకవర్గం లక్కరాజుగార్లపాడు గ్రామంలో ఇటీవల జరిగిన దాడిలో  గరికపాటి కృష్ణారావు అనే టీడీపీ కార్యకర్త మృతి చెందాడు. అయితే వైసీపీ శ్రేణుల దాడుల్లోనే కృష్ణారావు మరణించాడని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు.

లక్కరాజుగార్లపాడులో కృష్ణారావుకు నివాళులు అర్పించి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా లోకేశ్ ఆ కార్యకర్త కుటుంబానికి టీడీపీ తరఫున రూ.6 లక్షల ఆర్థికసాయం అందించారు. దీనిపై లోకేశ్ ట్విట్టర్ లో వెల్లడించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ రాక్షసానందం పొందుతున్న సైకో రెడ్డికి అన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని వ్యాఖ్యానించారు.

More Telugu News