1998 DSC: 1998 డీఎస్సీ అభ్యర్థుల ముట్టడియత్నం... జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత!

  • 1998 నుంచి పోస్ట్ లు ఇవ్వని ప్రభుత్వాలు
  • పాదయాత్రలో ఆదుకుంటానని జగన్ హామీ
  • ఇంకా పోస్ట్ లు ఇవ్వలేదని నిరసన
1998 DSP aspirents Protest near Jagan Camp Office

1998లో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో క్వాలిఫై అయి, ఆపై పోస్ట్ లను పొందలేకపోయిన టీచర్ అభ్యర్థులు, ఈ ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ముట్టడించేందుకు ప్రయత్నించిన వేళ, స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ సమస్యల గురించి పాదయాత్రలో తెలుసుకున్న జగన్, అధికారంలోకి వస్తే, తమకు పోస్ట్ లను ఇప్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఈ హామీ ఇచ్చి, 22 నెలలైనా అమలు చేయలేదని ఆరోపించారు. నిరసన తెలిపేందుకు తాడేపల్లి భరతమాత విగ్రహం వద్దకు చేరుకున్న డీఎస్సీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఆపై వారిని అరెస్ట్ చేసి, అక్కడి నుంచి వాహనాల్లో తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో పలువురు నిరుద్యోగులు వాగ్వాదానికి దిగారు.

More Telugu News