Vijayanagaram District: విజయనగరం రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్

  • ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు, ఒక లారీ
  • ప్రమాదంలో నలుగురి మృతి
  • విషమంగా మరో ఐదుగురి పరిస్థితి
Jagan expressed shock over Vijayanagaram road accident

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్సులు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ-విజయనగరం హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఒక లారీ ప్రమాదానికి గురైన ఓ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా... పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అధికారులతో ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. లారీ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ఆయనకు చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు జగన్ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.

More Telugu News