Bollywood: మ‌ళ్లీ బాలీవుడ్ సినిమాలో ఎప్పుడు న‌టిస్తావని ప్రశ్నించిన అభిమాని.. స‌మాధానం చెప్పిన‌ ప్రియాంక చోప్రా

  • ప్ర‌స్తుతం హాలీవుడ్‌పైనే ప్రియాంక ఫోక‌స్
  • రెండేళ్ల క్రితం ‘స్కై ఈజ్‌ పింక్‌’ సినిమాలో న‌టించిన ప్రియాంక‌
  • మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్‌లో న‌టించ‌ని వైనం
  • వ‌చ్చే ఏడాది బాలీవుడ్‌లో న‌టిస్తాన‌ని వెల్ల‌డి
will act in Bollywood movie next year

ప్ర‌స్తుతం హీరోయిన్ ప్రియాంక చోప్రా దృష్టంతా హాలీవుడ్ సినిమాల‌పైనే ఉంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి వెళ్లిన త‌ర్వాత ఆమె అక్క‌డే బిజీ అయిపోయింది. త‌న‌కు న‌చ్చే క‌థ‌ల‌తో ద‌ర్శ‌కులు త‌న ముందుకు వ‌స్తేనే హిందీ సినిమాల‌కు ఓకే చెబుతోంది.  

రెండేళ్ల క్రితం ‘స్కై ఈజ్‌ పింక్‌’ సినిమాలో న‌టించిన త‌ర్వాత మ‌ళ్లీ బాలీవుడ్‌లో ఆమె ఏ సినిమాకూ ఒప్పుకోలేదు. త్వరలో ఆమె బాలీవుడ్‌లో మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని ప్రచారం జ‌రుగుతోంది. దీనిపై సామాజిక మాధ్య‌మాల ద్వారా ఓ అభిమాని ఆమెను ప్ర‌శ్నించాడు.

ఆమె మ‌ళ్లీ బాలీవుడ్ సినిమాలో ఎప్పుడు న‌టిస్తుంద‌ని అడిగాడు. దీనికి ప్రియాంక చోప్రా స్పందిస్తూ వ‌చ్చే ఏడాది అని తెలిపింది. ఆ సినిమా గురించిన ఇత‌ర వివ‌రాల‌ను మాత్రం ఆమె వెల్ల‌డించ‌లేదు. మ‌ళ్లీ 2022లో ఆమెను బాలీవుడ్ సినిమాలో చూడొచ్చు. ప్రస్తుతం ఆమె రిచర్డ్‌ మాడెన్‌తో కలిసి అమెజాన్‌ సిరీస్‌లో ‘సిటాడెల్‌’తో పాటు ‘మ్యాట్రిక్స్ 4’లో నటిస్తోంది.

More Telugu News