Kurnool District: కర్నూలు ఎయిర్ పోర్టుకు నేటి నుంచే విమానాలు!

  • ఉదయం గం. 10.10కి ల్యాండ్ కానున్న తొలి విమానం
  • కర్నూలు నుంచి తొలి సర్వీస్ విశాఖపట్నానికి
  • ఏర్పాట్లు చేసిన అధికారులు
Flights Start fromKurnool Airport Today

ఈ నెల 25న జాతికి అంకితమైన కర్నూలు విమానాశ్రయంలో నేటి నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉదయం 10.10 గంటలకు బెంగళూరు నుంచి కర్నూలుకు రానున్న ఇండిగో విమానం (6ఈ 7911), ఆపై 10.30 గంటలకు విశాఖపట్నానికి (6ఈ 7912) బయలుదేరి వెళుతుంది. ఆపై అదే విమానం విశాఖ నుంచి కర్నూలుకు వచ్చి, బెంగళూరు వెళుతుంది. ఈ విమానానికి స్వాగతం పలికేందుకు జిల్లా మంత్రులతో పాటు కలెక్టర్ సిద్ధమయ్యారు. తొలి ప్యాసింజర్ కు స్మారక్ పోస్టల్ కవర్ ను అందించనున్నారు.

More Telugu News