Janasena: ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన కమిటీ నియామకం!

  • తెలంగాణలో దూకుడు పెంచుతున్న జనసేన
  • ఉమ్మడి నల్గొండ, నాగార్జునసాగర్ లకు కమిటీల నియామకం
  • పార్టీ అవసరాలరీత్యా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన
Janasena committee for Nalgoda district and Nagarjuna Sagar

తెలంగాణలో జనసేన తన కార్యాచరణను ముమ్మరం చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు, త్వరలో ఉపఎన్నిక జరుగుతున్న నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కమిటీలను నియమించింది. పార్టీ అవసరాలరీత్యా కమిటీలను నియమిస్తున్నట్టు జనసేన ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ:
ఉపాధ్యక్షులు: సరకొప్పుల నాగేశ్వరరావు, అందే శ్రీను, చింతల నాగార్జున, మచ్చ కిరణ్ గౌడ్.
ప్రధాన కార్యదర్శి: కంపల్లి వెంకల్
కార్యదర్శులు: చందు నాయక్, అగ్గి విజయం, తోట నవీన్, షేక్ హసన్ మియా, చిలుముల అశోక్, మార్గం జితేంద్ర, పల్లపు మహేష్.
సోషల్ మీడియా: పూర్ణచందర్, కోట్ల గోవర్ధన్.

నాగార్జునసాగర్ నియోజకవర్గం కమిటీ:
అధ్యక్షుడు: దండగుల కిరణ్ కుమార్
ఉపాధ్యక్షులు: కోటేశ్వరరావు, శివకుమార్
ప్రధాన కార్యదర్శి: దండు రవికుమార్
కార్శదర్శులు: రామ్ వంశీ, అఖిల్, మహమ్మద్ ఇస్మాయిల్, కమ్మంపాటి పరశురామ్, తిరుమల రెడ్డి, కోటేశ్వరరావు, పొన్నసాని సాగర్.

More Telugu News