Jana Reddy: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి

  • నోముల మృతితో ఉప ఎన్నిక 
  • ఏప్రిల్ 17న పోలింగ్
  • అభ్యర్థిని ప్రకటించిన ఏఐసీసీ
  • జానారెడ్డి అభ్యర్థిత్వానికి సోనియా ఆమోదం
Janareddy as Congress candidate in Nagarjuna Sagar by polls

టీఆర్ఎస్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 17న ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ లో పోటీచేసే అభ్యర్థిని ప్రకటించింది.

సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తారని ఏఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. జానారెడ్డి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదం తెలిపినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News