Tirupati: తిరుపతి బరిలో బీజేపీ అభ్యర్థి.. పవన్ తో వీర్రాజు చర్చలు సఫలం!

  • బీజేపీ అభ్యర్థిని నిలిపేందుకు జనసేన అంగీకారం
  • ఈ అంశంపై పవన్, వీర్రాజు చర్చలు
  • తిరుపతి నుంచే బీజేపీ విజయయాత్ర మొదలవుతుందన్న మురళీధరన్
BJP Candidate is contesting in Tirupati LS Bypolls

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు సంబంధించి బీజేపీ, జనసేన పార్టీల మధ్య క్లారిటీ వచ్చింది. ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని నిలిపేందుకు ఇరు పార్టీలు అంగీకరించాయి. జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చర్చించి, ఈ నిర్ణయానికి వచ్చారు. తిరుపతిలో బీజేపీ అభ్యర్థిని నిలబెడుతున్నట్టు బీజేపీ నేత మురళీధరన్ తెలిపారు.

జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ట్వీట్ చేశారు. పవన్, సోము వీర్రాజు ఇద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఏపీలో తిరుపతి నుంచే బీజేపీ విజయయాత్ర మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News