YS Sharmila: రాజకీయ పార్టీకి అదే పేరు పెట్టాలని భావిస్తున్న షర్మిల!

  • ప‌లు జిల్లాల వైఎస్ అభిమానుల‌తో ష‌ర్మిల‌ చ‌ర్చ‌లు
  • పార్టీ పేరు 'వైఎస్ఆర్ ‎టీపీ'?
  • పార్టీ జెండాలో మూడు రంగులు
sharmila party namee leak

తెలంగాణలోని ప‌లు జిల్లాల నుంచి వచ్చే వైఎస్ అభిమానుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న వైఎస్ ష‌ర్మిల కొత్త పార్టీ పెడ‌తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఆమె పార్టీ పేరు, జెండా, అజెండాపై ప‌లు అంశాలు లీక్ అవుతున్నాయి. త‌న తండ్రి పేరు క‌లిసివ‌చ్చేలా పార్టీకి 'వైఎస్ఆర్ ‎టీపీ'గా పేరు పెట్టాల‌ని ష‌ర్మిల భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అలాగే, పార్టీ జెండాలో మూడు రంగులు ఉండేలా డిజైన్ చేస్తున్నట్టు ప్రచారం జ‌రుగుతోంది. అందులో ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులు వుంటాయని తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీపై ఆమె ఇప్ప‌టి నుంచే ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్లాల‌ని ఆలోచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ఏదైనా ఓ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు హైదరాబాద్‎లోని ఓ నియోజకవర్గంలో కూడా పోటీ చేయాల‌ని ఆమె భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే ష‌ర్మిల ప‌లు జిల్లాల నేత‌ల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడారు. అలాగే, ఈ నెల‌ 19న కరీంనగర్ జిల్లా అభిమానులతో స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశాలు ముగిశాక ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే భారీ సభలో ఆమె త‌న‌ పార్టీ జెండాను ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిసింది.  

More Telugu News