Pawan Kalyan: రేపు విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకోనున్న పవన్ కల్యాణ్

  • రేపు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్
  • విజయవాడలో పవన్ కు ఓటు
  • పటమటలంక జడ్పీ హైస్కూల్లో ఓటు వేయనున్న పవన్
  • ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యన ఓటేయనున్న జనసేనాని
Pawan Kalyan will cast his vote tomorrow in Vijayawada

రేపు ఏపీ వ్యాప్తంగా పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఓటు వేయనున్నారు. పవన్ కల్యాణ్ పటమటలంకలోని కొమ్మ సీతారామయ్య జడ్పీ బాలికల హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియాలో వెల్లడించింది.

More Telugu News