Police Offcial: మనవడి కోసం మేకను బలిచ్చిన ఎస్సై... సస్పెండ్ చేసిన అధికారులు

  • రాజస్థాన్ లో ఘటన
  • మనవడి కేశఖండన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై
  • ఆలయంలో మేకను బలిచ్చి బంధుమిత్రులకు విందు
  • వైరల్ గా మారిన వీడియో
  • విచారణకు ఆదేశించిన కోట జిల్లా రూరల్ ఎస్పీ
Police officer sacrificed a goat in Rajasthan

దేశం ఓవైపు ఆధునికత దిశగా పరుగులు పెడుతున్న కాలంలోనూ మూఢనమ్మకాలు, జంతుబలులు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ లో ఓ పోలీసు అధికారి మేకను బలివ్వడం ఈ తరహా ధోరణికి నిదర్శనం. కోట జిల్లా డియోలీ-మాంఝీ పోలీస్ స్టేషన్ ఎస్సైగా పనిచేస్తున్న భన్వర్ సింగ్ ఇటీవల తన మనవడి కేశఖండన వేడుక నిర్వహించాడు. ఓ ఆలయంలో నిర్వహించిన ఈ వేడుకలో భన్వర్ సింగ్ మేకను కూడా బలిచ్చాడు. మనవడి కేశఖండన సందర్భంగా తన బంధుమిత్రులందరికీ విందు ఏర్పాటు చేశాడు.

అయితే ఎస్సై భన్వర్ సింగ్ మేకను బలి ఇచ్చిన విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోట జిల్లా గ్రామీణ ఎస్పీ శరద్ చౌదరి విచారణకు ఆదేశించారు. ఎస్సై భన్వర్ సింగ్ మేకను బలిచ్చిన విషయం నిర్ధారణ కావడంతో అతడిని వెంటనే సస్పెండ్ చేసి, పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు.

More Telugu News