Vijayasai Reddy: ఘర్షణలు రెచ్చగొట్టి రక్తపాతాలు సృష్టించడం బాబుకు కొత్తేం కాదు: విజ‌యసాయిరెడ్డి

  • గుళ్లు కూలగొట్టి, దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేశారు
  • స్లీపర్ సెల్స్ కు బాబు కొత్త ఎజెండాను అప్పజెప్పినట్టుంది
  • సడన్ గా నిలిచిపోయాయి
  • కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాల‌ని చెప్పి ఉంటాడు
vijaya sai slams chandrababu

టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి ప‌రోక్షంగా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న కొత్త కుట్ర‌లు ప‌న్నుతున్నారంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

'గుళ్లు కూలగొట్టి, దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసిన స్లీపర్ సెల్స్ కు బాబు కొత్త ఎజెండాను అప్పజెప్పినట్టుంది. సడన్ గా నిలిచిపోయాయి. పంచాయతీల్లో కులాలు, మతాల మధ్య, పేదల మధ్య చిచ్చుపెట్టే అసైన్ మెంటు ఇచ్చి ఉంటాడు. ఘర్షణలు రెచ్చగొట్టి రక్తపాతాలు సృష్టించడం బాబుకు కొత్తేం కాదు'  అని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.

'రాజ్యాంగబద్ధ పదవి ముసుగులో ఆ 'చంద్ర'ముఖి ఆత్మ రాష్ట్రంలో తిరుగుతూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోంది. విధులను గాలికొదిలేసి రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతోంది. మరో  రెండు నెలల్లో దెబ్బకు దెయ్యం వదిలిపోతుంది' అని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. కాగా, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారి ర‌మేశ్ కుమార్ స్థానిక‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టిస్తూ అధికారుల‌కు సూచ‌న‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే.

More Telugu News