Nellore District: లాడ్జీలో ఒకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు

  • యువతీయువకులను హరీశ్, లావణ్యలుగా గుర్తింపు
  • ఇద్దరూ మెట్టు సచివాలయ ఉద్యోగులే
  • ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని అనుమానం
Lovers suicide in nellore dist hotel with single rope

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. లాడ్జీలో దిగిన ఓ ప్రేమ జంట ఒకే తాడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమై ఉంటుందని వేదాయపాలెం పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లాలోని పడారుపల్లిలో జరిగిందీ ఘటన. యువతీయువకులను చిట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయ ఉద్యోగులు హరీశ్, లావణ్యగా గుర్తించారు. దర్యాప్తు అనంతరం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

More Telugu News