Nimmagadda Ramesh Kumar: ఒంటిమిట్ట కోదండ రాముడిని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ

  • గత రాత్రి ఒంటిమిట్ట చేరుకున్న నిమ్మగడ్డ
  • ఉదయం అభిషేక పూజలు
  • స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ
Nimmagadda visits Ontimitta kodanda rama temple

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ ఉదయం ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కడప జిల్లాలోని ఒంటిమిట్టకు గతరాత్రి చేరుకున్న నిమ్మగడ్డ ఈ తెల్లవారుజామున అభిషేక పూజల్లో పాల్గొన్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను పండితులు ఎస్‌ఈసీకి వివరించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కడప చేరుకున్న నిమ్మగడ్డ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరపనున్నారు.

More Telugu News