Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళాలు

  • అయోధ్యలో రామమందిరం నిర్మాణం
  • జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ
  • దేశవ్యాప్తంగా విరాళాల వెల్లువ
  • పూర్తి వివరాలు రావాల్సి ఉందన్న ట్రస్టు ప్రధాన కార్యదర్శి
Hundred crores donations for Ram Mandir construction in Arodhya

అయోధ్య లో రాముడి మందిరం నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు విరాళాలు సేకరించనున్నారు. దీనిపై శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పందించారు. ఇప్పటివరకు రూ.100 కోట్ల మేర విరాళాలు వచ్చాయని వెల్లడించారు. అయితే, ఈ విరాళాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రధాన కార్యాలయానికి అందాల్సి ఉందని, కార్యకర్తల నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఈ పవిత్ర కార్యానికి వంద కోట్ల రూపాయలు సమకూరినట్టు వివరించారు.

రామజన్మభూమి వివాదంపై  చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు.... రామమందిరం నిర్మాణం కోసం ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏర్పడిందే శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. అయోధ్యలో రామమందిరం నిర్మాణ కార్యకలాపాలను ఈ ట్రస్టు పర్యవేక్షిస్తుంది.

More Telugu News